పలు అంశాలపై సోనియాతో చర్చించాను: వీహెచ్
ABN, First Publish Date - 2022-04-04T23:56:01+05:30
తెలంగాణలోని పలు రాజకీయ అంశాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు
ఢిల్లీ: తెలంగాణలోని పలు రాజకీయ అంశాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించానని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా సోనియా గాంధీతో దాదాపు అరగంట సేపు ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనా సందర్భంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంలో సోనియాగాంధీ తనకు ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సమస్యలను సోనియాగాంధీకి వివరించానని ఆయన తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని సోనియాకు వివరించానన్నారు.
Updated Date - 2022-04-04T23:56:01+05:30 IST