అన్ని యూనివర్శిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
ABN, First Publish Date - 2022-01-16T20:49:23+05:30
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో అటు ప్రభుత్వం..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. కేసులు పెరుగుతుండడంతో తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించాయి. దీంతో అన్ని వర్శిటీల్లో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు సయితం వాయిదా పడ్డాయి. ఇక ఆన్ లైన్ తరగతులపై ఉస్మానియా వర్శిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు అన్ లైన్లో క్లాసులు నిర్వహించనున్నట్లు ఓయూ ప్రకటించింది.
Updated Date - 2022-01-16T20:49:23+05:30 IST