ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరి కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదు?: Bandi Sanjay

ABN, First Publish Date - 2022-06-26T00:51:19+05:30

Hyderabad: జీవో 317 విడుదలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: జీవో 317 విడుదలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 


మంత్రులు, ఎమ్మెల్యేలంతా వారి ఆస్తుల వివరాలు బయటపెట్టాలి

‘‘చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై  ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, ఇకపై ఆస్తులు అమ్మాలన్నా... కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమే. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా... ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం. కేసీఆర్ సీఎం కాకముందు ఆయన  ఆస్తులెన్ని? ఆ తరువాత కూడబెట్టిన ఆస్తులెన్ని? ఆ వివరాలను ఏటా  ఎందుకు విడుదల చేయడం లేదు? ఇకపై సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులంతా  ఏటా ఆస్తుల వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రుల ఆస్తులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ఆస్తుల వివరాలను బయటపెట్టాలి.’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-06-26T00:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising