ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తెలంగాణ‌లో ప్రైవేట్​ ఆస్పత్రులే దిక్కా?: విజ‌య‌శాంతి

ABN, First Publish Date - 2022-07-28T00:58:36+05:30

హైదరాబాద్: కేసీఆర్ పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ (KCR) పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి (VIJAYASHANTHI) ఆరోపించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. ఇండ్ల చుట్టూ నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్​ ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోందన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడంలేదని చెప్పారు. 




గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోగులు పీహెచ్‌‌సీలకు క్యూ కడుతున్నారని, అయినా వైద్యం సరిగా అందట్లేదని విజయశాంతి ఆరోపించారు. మరో దిక్కులేక ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ఆమె చెప్పారు. ఇదే అదనుగా ప్రైవేట్​ ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయన్నారు. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాములమ్మ మండిపడ్డారు. 

Updated Date - 2022-07-28T00:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising