కేసిఆర్కు కావాల్సింది ఓట్లు-సీట్లే.. ప్రజల బాగు కాదు: విజయశాంతి
ABN, First Publish Date - 2022-01-26T01:13:59+05:30
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్కు కావాల్సింది ఓట్లు-సీట్లు మాత్రమే తప్ప ప్రజల బాగు కాదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్కు కావాల్సింది ఓట్లు-సీట్లు మాత్రమే తప్ప ప్రజల బాగు కాదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఏరు దాటినదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు చేరినాక బోడి మల్లన్న... అన్నట్టు కేసిఆర్ సర్కార్ తీరుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు, మూడు నెలలు ముందే మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మాయమాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని రాములమ్మ చెప్పారు. అయినా అధికార పార్టీ నేతల కపట నాటకాలను గుర్తించిన ప్రజలు తమ ఓటుతో బీజేపీకి పట్టం కట్టడంతో ఓటమి నైరాశ్యంలో పడిన కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అటకెక్కించడమే కాకుండా.... చేస్తానన్న పనులను ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిన పాపానపోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు కంకణబద్దులై ఓట్ల రూపంలో తగిన బుద్ది చెప్పాలని రాములమ్మ పిలుపునిచ్చారు.
Updated Date - 2022-01-26T01:13:59+05:30 IST