Venkaiah Naidu: కృష్ణంరాజు నాకు అత్యంత ఆత్మీయులు..
ABN, First Publish Date - 2022-09-11T15:53:28+05:30
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని వెంకయ్య నాయుడు అన్నారు.
ఢిల్లీ (Delhi): కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (Krishnamraju) పరమపదించడం అత్యంత విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ట్విట్టర్ (Twitter)లో పేర్కొన్నారు. ‘‘మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.
శ్రీ కృష్ణంరాజు గారు నాకు అత్యంత ఆత్మీయులు. శ్రీ వాజ్ పేయి గారి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించేవారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరం’’. అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
Updated Date - 2022-09-11T15:53:28+05:30 IST