సెల్లార్ గుంత తీస్తుండగా ..గోడ కూలి ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2022-06-26T01:37:11+05:30
రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా పక్కనున్న మరో గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా పక్కనున్న మరో గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
మృతులు శ్రీకాకుళం వాసులు
‘‘నాలుగు గంటలకు మాకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి బయల్దేరాం. ఘటనా స్థలంలో ఐదుగురు పని చేస్తున్నారు. వారు పని చేస్తున్నసమయంలో మట్టిపెళ్ళలు విరిగి పడ్డాయి. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించాం. మృతులను ప్రసాద్, వెంకట రమణగా గుర్తించాం. వీరు శ్రీకాకుళం వాసులు. మిగతా ముగ్గురు ప్రమాదం నుంచి బయట పడ్డారు. వారినడిగి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటాం.’’ అని నార్సింగ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.
వర్షకాలం నేపథ్యంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా బిల్లర్లు వాటిని పట్టించుకోవడం లేదు.
Updated Date - 2022-06-26T01:37:11+05:30 IST