TRS నేతల రాజీనామా ఉపసంహరణ..
ABN, First Publish Date - 2022-02-28T19:15:11+05:30
TRS నేతల రాజీనామా ఉపసంహరణ..
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అడిక్మెట్ డివిజన్ ఉపాధ్యక్షుడు సురేందర్, ఆయన సతీమణి కె.అనురాధ తమ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ బి.హేమలతరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ తదితరులు విద్యానగర్లోని సురేందర్ ఇంటికి వచ్చి పార్టీ పరంగా అండగా ఉంటామని, తమ సేవలు పార్టీకి అవసరమని కోరారు. దీంతో సురేందర్ దంపతులు తమ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు బల్ల శ్రీనివా్సరెడ్డి, ఎం.డి.ఖదీర్, రవియాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్యామ్యాదవ్, వై.శ్రీనివాస్ తదితరులు వెళ్లారు.
Updated Date - 2022-02-28T19:15:11+05:30 IST