TS News: గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
ABN, First Publish Date - 2022-09-09T22:54:27+05:30
Hyderabad: మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రముఖుంగా ముగ్గురు ముందుకు వచ్చారు. వీరిలో ఒకరి పేరు ఖరారు చేసే అవ
Hyderabad: మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రముఖంగా ముగ్గురు ముందుకు వచ్చారు. వీరిలో ఒకరి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. మిగతా ఆశావహులను తప్పించే క్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు రేపు గాంధీభవన్లో భేటీకానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. మునుగోడు టికెట్ ఆశించిన అభ్యర్థులకు సర్దిచెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Updated Date - 2022-09-09T22:54:27+05:30 IST