Parliament: ధరల పెంపు, జీఎస్టీ పన్నుల అంశంపై ఉభయసభల్లో టీఆర్ఎస్ ఆందోళన
ABN, First Publish Date - 2022-07-22T19:55:01+05:30
ధరల పెంపు, జీఎస్టీ (GST) పన్నుల అంశంపై ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు.
ఢిల్లీ (Delhi): ధరల పెంపు, జీఎస్టీ (GST) పన్నుల అంశంపై ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు (TRS MPs) ఆందోళన చేపట్టారు. లోక్ సభ (Lok Sabha)లో ఎంపీలు స్పీకర్ పోడియం (Speaker podium) చుట్టు ముట్టి నిరసన తెలిపారు. గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపుపై ఫ్ల కార్డులు ప్రదర్శించారు. పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై విపక్షాలు సైతం ఆందోళనకు దిగాయి. ఇటు రాజ్యసభలో కూడా ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపుపై ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఎంపీలు విపక్షాలతో కలిసి పోడియం చుట్టు ముట్టి నిరసన తెలిపారు.
Updated Date - 2022-07-22T19:55:01+05:30 IST