ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతుబంధు’కు సమాయత్తం!

ABN, First Publish Date - 2022-12-10T03:00:51+05:30

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి క్యాబినెట్‌ భేటీలో తేదీల ఖరారు..

నిధులు సర్దుబాటుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. శనివారం నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో నిధుల లభ్యతపై చర్చించి తేదీలను ఖరారుచేసే అవకాశముంది. మూడు రోజుల క్రితం జగిత్యాలలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ‘రైతుబంధు’ అంశాన్ని ప్రస్తావించారు. పది, పన్నెండు రోజుల్లో రైతుబంధు నిధులు చెల్లిస్తామని, ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ఈ క్యాబినెట్‌ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలతోపాటు రైతుబంధు నిధుల పంపిణీ పైనా చర్చించనున్నారు. సుమారు 65 లక్షల మంది రైతుబంధు లబ్ధిదారులు ఉండగా... రూ. 7,434 కోట్ల నిధులు అవసరమవుతాయి. నిధులు సర్దుబాటైతే ఈనెల చివరివారంలో నగదు బదిలీ ప్రారంభించి, జనవరి నెలలో సంక్రాంతి లోపు ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ, ఆరోహణ క్రమంలో నగదు బదిలీ చేయనున్నారు.

Updated Date - 2022-12-10T03:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising