Telangana Govt: సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్గ్రేషియా
ABN, First Publish Date - 2022-09-13T15:37:48+05:30
సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం (Secundrabad fire accident)పై హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood ali) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బిల్డింగ్ సెల్లర్ను మిస్ యూస్ చేశారని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయని, 8 మంది పొగ ద్వారానే చనిపోయారని తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) తరపున రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బైక్ షోరూం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు హోంమంత్రి మహమూద్ అలీ (Telangana home minister) తెలిపారు.
Updated Date - 2022-09-13T15:37:48+05:30 IST