Telangana: KCRకు రైతుల కష్టాలు కనపడడం లేదా?: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల
ABN, First Publish Date - 2022-05-17T20:52:20+05:30
Telangana chief minister కేసీఆర్ కు రైతుల కష్టాలు కనపడడం లేదా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని, చేతులతో ఎత్తుకోలేక
Hyderabad: Telangana chief minister కేసీఆర్ కు రైతుల కష్టాలు కనపడడం లేదా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని, చేతులతో ఎత్తుకోలేక రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టించే మీరు పంట కొనమని వారికి ఎందుకు కల్లాలకు పంపరని ప్రశ్నించారు. తడిచిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా, కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-05-17T20:52:20+05:30 IST