ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి సంపులో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2022-01-29T15:41:56+05:30

నీటి సంపులో పడి ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలాజీ, సోనాబాయి దంపతులు బతుకు దెరువు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/సైదాబాద్‌: నీటి సంపులో పడి ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలాజీ, సోనాబాయి దంపతులు బతుకు దెరువు కోసం రెండు నెలల క్రితం నగరానికి వలస వచ్చారు. లక్ష్మీనగర్‌ కాలనీలో కొత్తగా నిర్మించనున్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అందులో గుడిసె వేసుకుని నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వారి కూతురు శివానీ(7) నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ ఖాళీస్థలంలో ఆడుకుంటూ మూత లేని నీటి సంపులో పడిపోయింది. కొద్ది సేపటికి కూతురు కనిపించకపోవడంతో సమీప ప్రాంతంలో వెదికారు. చివరకు సంపులో తేలియాడుతుండటం చూసి శివానీని బయటకు తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. సైదాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా  ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Updated Date - 2022-01-29T15:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising