ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడోసారి మోదీని ప్రధానిగా చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు..: రేవంత్

ABN, First Publish Date - 2022-02-21T20:36:33+05:30

మోదీని మూడోసారి ప్రధానిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపర్చి ఈ దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీని బలహీనం చేయాలంటే... ఇండియాలో ఉన్నవాళ్లను చీల్చాలని, కాంగ్రెస్‌ను బలహీనం చేయాలంటే... యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చాలన్నారు. సీఎం కేసీఆర్ యూపీఏలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేక ఎన్డీయేలో ఉన్నవాళ్లను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.


కేసీఆర్‌కు నిజంగా మోదీని ఓడించాలనే ఉంటే.. యూపీలో సభలు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇంకా నాలుగు విడతల ఎన్నికలు ఉన్నాయని, మోదీ, యోగీని ఓడించడానికి విడతకొక బహిరంగ సభలు పెట్టాలన్నారు. మోదీని గెలిపించాలని యూపీ ప్రజలకు చెబుతారని... ఇక్కడేమో మోదీని ఓడిస్తానని చెబుతారని... ఈ రెండింటికి అసలు సారూప్యత ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-02-21T20:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising