ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్ కోసం అమిత్ షా.. బుల్డోజర్‌ను గిఫ్ట్‌గా పంపిస్తున్నారు: రాజాసింగ్

ABN, First Publish Date - 2022-03-17T19:46:09+05:30

సీఎం కేసీఆర్‌తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే రాజసింగ్ పిలుపిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే రాజసింగ్ పిలుపిచ్చారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు వ్యక్తులు కాదు.. శక్తులని అభివర్ణించారు. బండి సంజయ్ లాంటి నాయకుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం పార్టీ కార్యకర్తల అదృష్టమన్నారు. బండి సంజయ్ కోసం అమిత్ షా.. బుల్డోజర్‌ను గిఫ్ట్‌గా పంపిస్తున్నారన్నారు. తెలంగాణలో అవినీతి దొంగలపై బుల్డోజర్లను ఎక్కిస్తామని హెచ్చరిక చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బుల్డోజర్‌ తిరుగబోతోందన్నారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సభలో సీఎం కేసీఆర్ అవినీతిని బయట పెడతారన్న కారణంగానే ఈటలను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Updated Date - 2022-03-17T19:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising