ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బడ్జెట్ చూస్తే బాధాకరంగా ఉంది: పొన్నాల లక్ష్మయ్య

ABN, First Publish Date - 2022-02-01T20:37:59+05:30

కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ప్రధాన్యతలు కూడా తెలియదని, పన్నుల వసూలు పెరిగిందని బల్లలు చర్చడం సిగ్గుచేటన్నారు. పేద ప్రజల మీద భారం తగ్గించడానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని, అందుకే ముఖ్యంత్రి గిల గిలా కొట్టుకుంటున్నారని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. అమెరికా, చైనా ఆర్థిక వృద్ధిరేటు ఎంత?.. భారత్ వృద్ధిరేటు ఎంత? అని ప్రశ్నించారు. ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదన్నారు. పీఎం మోదీ నిన్న యూపీలో మాట్లాడిన మాటలు ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. దేశ అప్పులు 232.8 బిలియన్ డాలర్ల నుంచి 1626 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఏడింతల అప్పులు పెంచి దేశాన్ని దివాళా తీశారని పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-02-01T20:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising