తెలంగాణలో ప్రసూతి సేవలు భే ష్: యునిసెఫ్
ABN, First Publish Date - 2022-12-31T04:59:25+05:30
మాతా శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది.
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసూతి సేవలు అందించడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, దిక్సూచిగా మారిందని అభినందించింది. రాష్ట్రంలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘‘ఫర్ ఎవ్రీ చైల్డ్, ఎ హెల్తీ స్టార్ట్ ’’ హాష్ ట్యాగ్తో హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన శిశువు ఫొటోను జత చేసి, యునిసెఫ్ ఈ ట్వీట్ చేసింది. యునిసెస్ పోస్టుపై మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందనడానికి ఇది మరొక నిదర్శనమని ట్వీట్ చేశారు.
Updated Date - 2022-12-31T04:59:26+05:30 IST