Kishan reddy కొందరు టూరిస్ట్లను తీసుకొచ్చి సభ పెట్టారు: Malla reddy
ABN, First Publish Date - 2022-05-15T19:04:56+05:30
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొందరు టూరిస్ట్లను తీసుకొచ్చి సభ పెట్టారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
Hyd: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan reddy) కొందరు టూరిస్ట్లను తీసుకొచ్చి సభ పెట్టారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సభలో అమిత్షా (Amit Shah) మతిభ్రమించి మాట్లాడారని, బీజేపీ డబుల్ ఇంజన్ కాదు.. సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం మానకుంటే తడాఖా చూపిస్తామని అన్నారు. బీజేపీ జూటా పార్టీ అని.. ఆ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ చేశారు.
Updated Date - 2022-05-15T19:04:56+05:30 IST