KCR సర్కార్ విఫలమైంది: తరుణ్చుగ్
ABN, First Publish Date - 2022-06-08T23:38:46+05:30
అన్నిరంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బీజేపీ నేత తరుణ్చుగ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: అన్నిరంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బీజేపీ నేత తరుణ్చుగ్ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జంగల్రాజ్ నడుస్తోందని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఫాంహౌస్లో.. మంత్రి కేటీఆర్ ట్విటర్లో.. హోంమంత్రి మహమ్మద్ అలీ సెలవుల్లో ఉన్నారంటూ తరుణ్చుగ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదన్నారు. జూబ్లీహిల్స్ ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని తరుణ్చుగ్ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-08T23:38:46+05:30 IST