HYD: కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ Vijaya reddy
ABN, First Publish Date - 2022-06-23T20:20:18+05:30
ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి (Vijaya reddy) గురువారం కాంగ్రెస్లో చేరారు.
Hyderabad: దివంగత పీజేఆర్ (PJR) కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి (Vijaya reddy) గురువారం కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth reddy) కాంగ్రెస్ (Congress) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటానన్నారు. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని ఆమె అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని, ఇక మూడు రంగుల జెండా వదలనని, తనదిక ఒకటే జెండా..ఒకటే బాటని విజయారెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2022-06-23T20:20:18+05:30 IST