Hyderabad: IPL ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జోరుగా సాగిన Bettingలు
ABN, First Publish Date - 2022-05-30T17:11:07+05:30
ఐపీఎల్ (IPL) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లో బెట్టింగ్లు జోరుగా సాగాయి.
Hyderabad: ఐపీఎల్ (IPL) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నగరంలో బెట్టింగ్ (Betting)లు జోరుగా సాగాయి. సైబరాబాద్ పరిధిలో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల అపార్ట్మెంట్లలో జోరుగా బెట్టింగ్లు జరిగాయి. నిమిషాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. దీనిపై పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి మాదాపూర్ ఎస్వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. బాచుపల్లిలో ముగ్గురు, మియాపూర్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రూ. 10 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బూకిలకు కింగ్ పింగ్గా ఉన్న భీమవరంకు చెందిన వర్మ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2022-05-30T17:11:07+05:30 IST