కేబీఆర్ పార్కుకు దీటుగా గాజుల రామారం ప్రాణవాయువు పార్క్
ABN, First Publish Date - 2022-03-02T21:28:32+05:30
హైదరాబాద్: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పార్కుల సుందరీకరణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది
హైదరాబాద్: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పార్కుల సుందరీకరణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. కేబీఆర్ పార్క్కు ధీటుగా కుద్బుల్లాపూర్లోని గాజులరామారం ప్రాణవాయువు పార్కు అందుబాటులోకి రావడంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 142 ఎకరాల్లో జీహెచ్ఎంసీ ప్రాణవాయువు పార్కును ఏర్పాటు చేసింది.
జీహెచ్ఎంసీ ఇప్పటికే థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్టు పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా హైదరాబాద్లో కేబీఆర్ పార్కును తలదన్నె విధంగా రూ. 15 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ప్రాణవాయువు పార్కును ఏర్పాటు చేసింది.
Updated Date - 2022-03-02T21:28:32+05:30 IST