ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్టర్ల మర్డర్‌ స్కెచ్‌.. మట్టారెడ్డిపై పోలీసుల ఫోకస్‌

ABN, First Publish Date - 2022-03-12T16:20:30+05:30

రియల్టర్ల మర్డర్‌ స్కెచ్‌.. మట్టారెడ్డిపై పోలీసుల ఫోకస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఇబ్రహీంపట్నం పరిధి కర్ణంగూడ శివారులో ఇటీవల కలకలం సృష్టించిన ఇద్దరు రియల్టర్ల హత్య కేసులో నిందితులను రాచకొండ పోలీసులు విచారిస్తున్నారు. ప్రత్యర్థులైన ఇద్దరు రియల్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేంద్రరెడ్డిలను సుపారీ గ్యాంగ్‌తో చంపించిన ప్రధాన నిందితుడు మట్టారెడ్డి అలియాస్‌ అశోక్‌రెడ్డితో పాటు తుపాకీతో కాల్చిన నిందితులు ఖాజా మొయినుద్దీన్‌, బుర్రి భిక్షపతి, తుపాకులు సమకూర్చడానికి సహకరించిన సయ్యద్‌ రహీం, సమీర్‌ ఆలీ, రాజా ఖాన్‌లను పోలీసులు కోర్టు అనుమతితో ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ప్రధానంగా మట్టారెడ్డిపై ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది. శ్రీనివా్‌సరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలతో మట్టారెడ్డికి ఎలా పరిచయమైంది, వారి మధ్య గొడవలకు కారణాలేంటి అనే వివరాలను రాబడుతున్నారు. అలాగే నిందితులు ఉపయోగించిన తుపాకులను తయారు చేసి ఇచ్చిన చందన్‌, సోనూలను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం బిహార్‌కు వెళ్లింది. నేడో, రేపో నిందితులను నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.



Updated Date - 2022-03-12T16:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising