భార్యను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన భర్త అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2022-06-09T15:28:20+05:30
ఇద్దరూ ప్రేమించుకొని తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. రహ్మత్నగర్..
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : భార్యను హత్య చేసిన భర్తను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్కు చెందిన మదావత్ భీముడు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. అతడికి నలుగురు పిల్లలు. మొదటి కుమార్తె మదావత్ సరోజ(21) ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. పూల డెకొరేషన్ కోసం వచ్చిన మహబూబ్నగర్కు చెందిన ఆర్. అనిల్కుమార్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకొని తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. రహ్మత్నగర్ ఎస్పీఆర్ హిల్స్ సుభాష్నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.
అనిల్కు గతంలోనే వివాహం అయిందని, నలుగురు పిల్లలున్నారని తెలియడంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఈ నెల 1న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అనిల్ సరోజ తలపై డంబుల్తో కొట్టాడు. అనంతరం ఊపిరాడకుండా గొంతు నులిమి హత్య చేశాడు. డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కి పారిపోయాడు. నాలుగు రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2020లో మొదటి భార్యను హత్య చేసి జైలుకెళ్లి వచ్చాడు. నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించారు.
Updated Date - 2022-06-09T15:28:20+05:30 IST