హైటెన్షన్ స్తంభం ఎక్కి హల్చల్
ABN, First Publish Date - 2022-01-29T17:49:20+05:30
సైదాబాద్, సింగరేణి పిట్టలోని బస్తీకి చెందిన మోహన్బాబు (35) శుక్రవారం హైటెన్షన్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే దూకుతానని
మద్యం డబ్బుల కోసం గంటన్నర పాటు హైడ్రామా
హైదరాబాద్/సైదాబాద్: సైదాబాద్, సింగరేణి పిట్టలోని బస్తీకి చెందిన మోహన్బాబు (35) శుక్రవారం హైటెన్షన్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సుమారు గంటన్నర పాటు స్తంభం మీదే కూర్చుని అందరినీ ఆందోళనకు గురిచేశాడు. అనంతరం పోలీసుల అభ్యర్థన మేరకు కిందకు దిగాడు. అతడిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోహన్బాబు జులాయిగా తిరుగుతాడని, రోజంతా మద్యం మత్తులో ఉంటాడని అతడి భార్య తెలిపింది. తాను కూలి పనులు చేసి పోషిస్తున్నానని, ఇద్దరు కూతుళ్లు, బాబు ఉన్నాడని వివరించింది. ఓ కూతురు మానసిక వికలాంగురాలని తెలిపింది. తన భర్త మానసికస్థితి సక్రమంగా లేదని, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పింది.
Updated Date - 2022-01-29T17:49:20+05:30 IST