TS News: రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2022-10-11T23:44:53+05:30
Hyderabad: రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4వారాలు గడుస్తున్నా.. ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. బోర్డు నిర్ణయం పెండింగ్లో ఉందని పేర్కొంటూ.. కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు వారాల సమయం కోరింది. ఈనెల 20లోపు
Hyderabad: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4వారాలు గడుస్తున్నా.. ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు నిర్ణయం పెండింగ్లో ఉందని పేర్కొంటూ.. కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు వారాల సమయం కోరింది. ఈనెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెబుతూనే ఇకపై గడువు పొడిగించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.
మహ్మద్ ప్రవక్తను కించపర్చారనే ఆరోపణలతో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. హైద్రాబాద్లో మునావర్ ఫరూఖీ షో నిర్వహించవద్దని రాజాసింగ్ గతంలో డిమాండ్ చేశారు. షోను నిర్వహించడంపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు.
Updated Date - 2022-10-11T23:44:53+05:30 IST