ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారు?: హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-04-17T19:30:52+05:30

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని నిలదీశారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణకు ఏం చేశాయని ప్రశ్నించారు. కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వమని, టీఆర్ఎస్ పేదలకు పంచే ప్రభుత్వమని అన్నారు. కేంద్రం పేదల ఉసురు పోసుకుంటోందన్నారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గానే చూసిందని హరీష్‌రావు విమర్శించారు.

Updated Date - 2022-04-17T19:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising