Gift Voucher వచ్చిందని Jio Mart పేరుతో మహిళకు ఫోన్.. నిమిషాల్లో జరిగిన సీన్ ఇదీ..
ABN, First Publish Date - 2022-02-13T16:57:27+05:30
శుక్రవారం మధ్యాహ్నం ఓ యువతి ఫోన్ చేసి జియో మార్ట్లో..
హైదరాబాద్ సిటీ/బాలానగర్ : జియోమార్ట్ పేరిట వచ్చిన ఫోన్కాల్తో మహిళ మోసపోయింది. సైబర్ నేరగాళ్లు అడిగిన విధంగా రూ. 29,351 నగదు చెల్లించింది. శనివారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధి గురుమూర్తినగర్లో నివాసం ఉండే పల్లె అజయ్ భార్య స్వప్నకు జియో మార్ట్ అకౌంట్ ఉంది. అప్పుడప్పుడు ఆమె అందులో షాపింగ్ చేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం ఓ యువతి ఫోన్ చేసి జియో మార్ట్లో రూ.56 వేల విలువ చేసే రిఫ్రిజిరేటర్ గిఫ్ట్ ఓచర్ వచ్చిందని అది పొందాలంటే రూ. 11,999 విలువ చేసే షాపింగ్ చేయాలని, షాపింగ్ డబ్బులను జియో మార్ట్లో కాకుండా ఆ యువతి చెప్పిన ఎకౌంట్కు పంపాలని చెప్పడంతో రూ. 29,351 నగదును విడతల వారీగా పంపింది. కొద్దిసేపటి తరువాత గిఫ్ట్ ఓచర్ గురించి ఫోన్ చేయగా ఎత్తక పోవడంతో మోసపోయానని గమనించిన స్వప్ప శనివారం సాయంత్రం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-02-13T16:57:27+05:30 IST