Hyderabad: స్నేహితుడే హంతకుడు
ABN, First Publish Date - 2022-06-26T17:03:41+05:30
కుషాయిగూడలో ఈ నెల 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీకాంత్రెడ్డి(37) ఉదంతం హత్యగా తేల్చారు పోలీసులు. అతడితో కలిసి నిత్యం మద్యం సేవించే
హైదరాబాద్/ఏఎస్రావునగర్: కుషాయిగూడలో ఈ నెల 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీకాంత్రెడ్డి(37) ఉదంతం హత్యగా తేల్చారు పోలీసులు. అతడితో కలిసి నిత్యం మద్యం సేవించే స్నేహితుడు ఉదయ్కుమార్ను నిందితుడిగా గుర్తించారు. నాగార్జుననగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్రెడ్డి తండ్రి ధర్మారెడ్డి రెండేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లి వెంకటమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. తల్లి వెంకటమ్మ ఇటివల రాంపల్లి ఆర్ఎల్నగర్లో నివాసం ఉండే కూతురు వద్దకు వెళ్లింది. తిరిగి 19న ఉదయం వచ్చే సరికి ఇంట్లో హాలులో శ్రీకాంత్రెడ్డి హాలులో అపస్మారక స్థితిలో పడి ఉ న్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పో లీసులు అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టగా పలు నిజాలు వెలు గులోకి వచ్చాయి. శ్రీకాంత్రెడ్డి స్నేహితుడు చెన్నోజు ఉదయ్కుమార్చారి ఈ హత్య చేసినట్లు తేల్చారు. మృతుడి తన తల్లి వెంకటమ్మ చంపి ఆస్తిని ఎంజా య్ చేసేందుకు చూస్తున్నానని ఉదయ్కుమార్తో చెప్పాడు. అతడు వారించగా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఉదయ్ శ్రీకాంత్పై పగ పెంచుకున్నాడు. మొదట విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపో వడంతోడంబెల్తో చాతీపై గట్టిగా కొట్టి హత్యచేసి పారిపోయాడు. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు నిందితుడు ఉదయ్కుమార్ను శనివారం చక్రీపురంలో అరె్స్టచేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్దనుంచి సెల్ఫోన్, డంబెల్ స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2022-06-26T17:03:41+05:30 IST