బస్సు ప్రమాద బాధితులకు
ABN, First Publish Date - 2022-06-26T16:45:55+05:30
కర్ణాటకలోని కాలబురగి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం మంజూరు
రూ.24.50 లక్షల పరిహారం మంజూరు
హైదరాబాద్ సిటీ: కర్ణాటకలోని కాలబురగి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. ఈ నెల 3న నగరానికి చెందిన పలువురు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, కర్ణాటకలో దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించి మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ.3 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రూ.24.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. సోమవారం బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేయనున్నారు.
Updated Date - 2022-06-26T16:45:55+05:30 IST