ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-21T17:48:39+05:30

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/జవహర్‌నగర్‌:  కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పరిధిలోని అంబేడ్కర్‌నగర్‌లో గురువారం జరిగింది. సీఐ చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన లక్ష్మణ్‌ స్థానికంగా కొబ్బరి బొండాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య అనూష, ముగ్గురు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు పునీత్‌(9 ఏళ్లు)కి వారం క్రితం ఫిట్స్‌ రావడంతో నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. కాగా, గురువారం అతడి దహన సంస్కారాలు నిర్వహించి లక్ష్మణ్‌ ఇంటికి వచ్చాడు. అయితే కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ రెండో కుమారుడు చనిపోవడం, ఇప్పుడు పెద్ద కొడుకు ఆకస్మికంగా మరణించడంతో తట్టుకోలేని లక్ష్మణ్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-01-21T17:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising