ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Etala: మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు..

ABN, First Publish Date - 2022-09-12T21:25:31+05:30

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, (హైదరాబాద్): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తల్లకిందులుగా తపస్సు చేసినా.. మునుగోడు (Munugodu)లో టీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. బీజేపీని గెలిపించాలని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫ్యూజ్ పీకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి కేసీఆర్ సర్కార్ పేదల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాని సీఎం కేసీఆర్ ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దతున్నారని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


కాగా అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కాలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో ఈటల అసెంబ్లీకి రాలేదు. సోమవారం నుంచి బండి సంజయ్‌ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు పాదయాత్ర సాగనుంది. 10 రోజులు, 115 కిలోమీటర్లు జరుగుతుంది. ముందుగా చిత్తారమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 

Updated Date - 2022-09-12T21:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising