Liquor Scam: హైదరాబాద్లో పలుచోట్ల ఈడీ సోదాలు
ABN, First Publish Date - 2022-09-19T21:33:46+05:30
హైదరాబాద్ (Hyderabad): నగరంలో మరోసారి ఈడీ (ED) సోదాలు (searches) కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ (Hyderabad): నగరంలో మరోసారి ఈడీ (ED) సోదాలు (searches) కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. డిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ (ED) మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్లో పలుచోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడి ఐదు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మూడు ఐటి కంపెనీలు, రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్లోని శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ఇంట్లో, ఉప్పల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. రామంతాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్ ఇతర ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా నిన్న ఏ14గా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai)ని ఈడీ విచారించింది. సుమారు 8 గంటల విచారణలో పిళ్లై బ్యాంక్ లావాదేవీలు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది.
Updated Date - 2022-09-19T21:33:46+05:30 IST