ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: గాంధీభవన్‌లో రాజీవ్ ప్రమాద బీమా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2022-09-14T20:06:38+05:30

గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా లబ్దిదారులకు కాంగ్రెస్ చెక్కులను పంపిణీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా (Rajiv Gandhi Accident Insurance) లబ్దిదారులకు కాంగ్రెస్ (Congress) చెక్కులను పంపిణీ చేసింది. తొమ్మిది మందికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెక్కులను పంపిణీ చేసింది.  మిగతావారికి ఇంటి వద్దకే చెక్కులను పంపనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ (TPCC Chief) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. 45 లక్షల సభ్యులకు రూ.2లక్షల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 427 మంది సభ్యులు చనిపోయారని.. వీరందరికి ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. 129 మంది ప్రమాద బీమాకు సంబంధించి ధ్రువపత్రాలు సమర్పించారని తెలిపారు. ధ్రువపత్రాలు సమర్పించని వారు వీలైనంత త్వరగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ (Manickam Tagore), ఇతర నేతలు హాజరయ్యారు. 

Updated Date - 2022-09-14T20:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising