ఇద్దరు పిల్లలతో సహా తండ్రి అదృశ్యం
ABN, First Publish Date - 2022-12-10T00:39:18+05:30
ఓల్డ్ బోయినపల్లిలో నివాసముంటున్న సుమన్ కుమార్ (30) భార్యతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
బోయినపల్లి, డిసెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఓల్డ్ బోయినపల్లిలో నివాసముంటున్న సుమన్ కుమార్ (30) భార్యతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలంగా ఇత డు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో భార్య అల్పనతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గొడవపడ్డారు. మనస్తాపం చెందిన సుమన్కుమార్.. కుమారుడు సాత్విక్(13), కూతురు శాన్వి(9)ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భర్త రెండు రోజులుగా ఇంటికి రాకపోవడం, బంధువుల ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో అనుమానం వచ్చిన అల్పన బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు.
Updated Date - 2022-12-10T00:39:20+05:30 IST