TS News: వైఎస్ షర్మిలపై స్పీకర్కు పిర్యాదు
ABN, First Publish Date - 2022-09-14T02:15:45+05:30
Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy)కి పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి (N
Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy)కి పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy)పై ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో.. పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Updated Date - 2022-09-14T02:15:45+05:30 IST