ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR review: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష

ABN, First Publish Date - 2022-08-02T21:30:33+05:30

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష (review) నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష (review) నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ కేశవరావుతో సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, సీఎస్, డీజీపీ, నారదాసు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. దేశ సమైక్యతా, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 


కాగా రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలు సిద్ధం చేశారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శనలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. కాగా ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-02T21:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising