ఇంటి ఎదుట నిలబడి పక్కింటివారితో మహిళ మాట్లాడుతుండగా.. సడన్గా..!
ABN, First Publish Date - 2022-06-03T17:09:27+05:30
ఇంటి ఎదుట నిలబడి పక్కింటివారితో మహిళ మాట్లాడుతుండగా.. సడన్గా..!
హైదరాబాద్ సిటీ/చందానగర్ : ఓ మహిళ పక్కింటి వారితో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లాడు. చందానగర్లో ఉంటున్న హెబ్సిబా బుధవారం ఉదయం ఇంటి ఎదుట నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతోంది. గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-06-03T17:09:27+05:30 IST