వైభవంగా బోనాలు
ABN, First Publish Date - 2022-08-09T05:41:33+05:30
శేరిలింగంపల్లి గ్రామంలో సోమవారం పోచమ్మ తల్లి ఆలయంలో రేవంత ముదిరాజ్ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు.
ఫలహారబండి ఊరేగింపులో ఎమ్మెల్యే గాంధీ
గచ్చిబౌలి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి గ్రామంలో సోమవారం పోచమ్మ తల్లి ఆలయంలో రేవంత ముదిరాజ్ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ఫలహారబండి ఊరేగింపును కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన అధ్య క్షుడు మారబోయిన రాజుయాదవ్, వివేకానందనగర్, చందానగర్ డివిజన్ల అధ్యక్షులు సంజీవరెడ్డి, రఘునాథ్రెడ్డి, ప్రధానకార్యదర్శి రవీందర్గౌడ్, నాయకులు కృష్ణయాదవ్, పద్మారావు, కొండా విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ (ఆంధ్రజ్యోతి): హుడాకాలనీలో సోమవారం వైభవంగా పోచమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన అ ధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నాయకులు విమల్కుమార్, నరేంద్ర, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-09T05:41:33+05:30 IST