Bhatti Vikramarka: రాహుల్ చేస్తున్నది హిస్టారికల్ పాదయాత్ర...
ABN, First Publish Date - 2022-10-01T19:35:46+05:30
రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్నది హిస్టారికల్ పాదయాత్ర అని భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్ (Hyderabad): రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్నది హిస్టారికల్ పాదయాత్ర అని, మహారాష్ట్రలో ఎంటర్ అయ్యే ప్రదేశాన్ని పరిశీలిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ నేత సంపత్ నివాసం వద్ద తెలంగాణ, మహారాష్ట్ర నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రంలో కంటే ఎక్కువ ఎఫెక్ట్తో తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొనాలని పిలుపిచ్చారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్ (Naseem Khan) మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడానికోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. దేశాన్ని కొందరు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని కలపడానికి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నదమ్ముల లాంటి వారని అన్నారు. రాహుల్ పాదయాత్ర కోసం మహారాష్ట్ర ఎదురుచూస్తోందన్నారు.
మహారాష్ట్ర సీఎల్పీ నేత బాల సాహెబ్ (Bala Saheb) మాట్లాడుతూ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. పాదయాత్ర కోసం తెలంగాణలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?.. తామేం చేయాలనే అంశంపై అధ్యయనం కోసం వచ్చామన్నారు. చరిత్ర గుర్తుంచుకోనేలా మహారాష్ట్రలో రాహుల్ పాదయాత్రకు స్వాగతం పలుకుతామని బాల సాహెబ్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-10-01T19:35:46+05:30 IST