సమతామూర్తి విగ్రహావిష్కరణ బీజేపీ కార్యక్రమంగా సాగింది: భట్టి
ABN, First Publish Date - 2022-02-06T20:44:27+05:30
సమతామూర్తి విగ్రహావిష్కరణ బీజేపీ కార్యక్రమంగా సాగిందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
హైదరాబాద్: సమతామూర్తి విగ్రహావిష్కరణ బీజేపీ కార్యక్రమంగా సాగిందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమతామూర్తి విగ్రహావిష్కరణ అసమానతలతో జరిగిందన్నారు. ఈక్వాలిటీకి వ్యతిరేకంగా, రామానుజన్కి అవమానంగా భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ గౌరవాన్ని మంటగలిపారన్నారు. రామానుజన్ సిద్ధాంతాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. బీజేపీది విభజించు-పాలించు విధానమని దుయ్యబట్టారు. అందరినీ సమానంగా చూసినప్పుడే.. రామానుజన్ సిద్ధాంతాలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను బీజేపీ వేర్వేరుగా చూస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.
Updated Date - 2022-02-06T20:44:27+05:30 IST