TSRTCని ప్రైవేటు పరంచేసే ప్రయత్నం..: Bandy Sanjay
ABN, First Publish Date - 2022-06-10T19:22:18+05:30
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు పరంచేసే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.
Hyderabad: తెలంగాణ ఆర్టీసీ (RTC)ని ప్రభుత్వం ప్రైవేటు పరంచేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandy Sanjay) ఆరోపించారు. శుక్రవారం ఆయన జేబీఎస్ బస్టాండులో ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను సీఎం కేసీఆర్ (CM KCR) ఆయన అనుచరులకు దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-06-10T19:22:18+05:30 IST