ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: పాదయాత్రకు తాత్కాలిక విరామం.. నేడు ఢిల్లీకి బండి‌ సంజయ్

ABN, First Publish Date - 2022-08-05T13:48:20+05:30

బండి‌ సంజయ్‌ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌ (Bandi Sanjay) పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ  పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం జేపీ నడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah)ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Rajagopal Reddy) చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం. రాజగోపాల్‌ను పార్టీలోకి ఢిల్లీలో చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా మునుగోడులో కాషాయ కండువా కప్పలా అనే దానిపై కూడా సమాలోచనలు జరపనున్నారు. అలాగే పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో వాస్తవ పరిస్థితులపై అమిత్ షా నివేదికలు తెప్పించుకున్నారు. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం  చేస్తోంది. 

Updated Date - 2022-08-05T13:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising