మరింత విశాలంగా బాలాపూర్ గణేష్ మండపం
ABN, First Publish Date - 2022-08-18T05:23:50+05:30
గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్థలం తక్కువగా ఉండడం, భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
రూ.66.50లక్షలతో 130 గజాల స్థలం కొనుగోలు
సరూర్నగర్/పహాడిషరీఫ్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్థలం తక్కువగా ఉండడం, భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు పాత గ్రామ పంచాయతీ ఆవరణలో బాలాపూర్ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మండప స్థలాన్ని విస్తరించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పాత గ్రామ పంచాయతీని ఆనుకుని ఉన్న 130 గజాల స్థలాన్ని రూ.66.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. బుధవారం పాత ఇంటిని కూల్చి వేసే పనులు చేపట్టారు. వినాయక చవితి వరకు ఆ స్థలాన్ని శుభ్రం చేసి మరింత విశాలంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-08-18T05:23:50+05:30 IST