ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Badangpet: శుభ కార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు గుల్ల

ABN, First Publish Date - 2022-01-27T17:43:06+05:30

శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా దొంగలు ఇంట్లో చొరబడి కప్‌ బోర్డులో ఉన్న 30 తులాల బంగా ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడంగ్‌పేట్‌ శివనారాయణపురంలో భారీ చోరీ

 రూ.15లక్షలు విలువైన బంగారు ఆభరణాలు అపహరణ

హైదరాబాద్/సరూర్‌నగర్‌: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా దొంగలు ఇంట్లో చొరబడి కప్‌ బోర్డులో ఉన్న 30 తులాల బంగా ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మద్ది మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని శివనారాయణపురం కాలనీకి చెందిన కె.రత్నాకర్‌రావు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌. బుధవారం పక్క వీధిలో తెలిసిన వారి ఇంట్లో శుభకార్యానికి మధ్యాహ్నం ఒంటి గంటకు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. తిరిగి మూడున్నర గంటలకు ఇంటికి వచ్చే సరికి మెయిన్‌ డోర్‌ తాళం పగులగొట్టి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పక్కన గల కప్‌ బోర్డులో దాచిన 30తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. చోరీ జరిగినట్టు గుర్తించి మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

Updated Date - 2022-01-27T17:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising