ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన కురుబ సంఘం
ABN, First Publish Date - 2022-08-09T02:33:31+05:30
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించిన కురుబ సంఘం
అనంతపురం: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జిల్లా కురుబ సంఘం స్పందించింది. మాధవ్ వ్యవహారంలో కమ్మ-కురుబల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. అటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని కురుబ సంఘం పేర్కొంది. గ్రామాల్లో రెండు కులాలు సోదర భావంతో మెలుగుతారని, అటువంటి వాతావరణాన్ని పాడుచేసే ప్రయత్నాలకు కురుబ సోదరులు సహకరించద్దన్నారు. అన్ని పార్టీల్లోనూ మన కులస్తులు వివిధ హోదాల్లో ఉన్నారని, కురుబ సోదరులు సంయమనం పాటించాలన్నారు.
Updated Date - 2022-08-09T02:33:31+05:30 IST