ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Langerhouse: చెరువులను దత్తత తీసుకుంటా

ABN, First Publish Date - 2022-01-18T15:36:35+05:30

చెరువుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నాంది పలికింది. లంగర్‌హౌ్‌సలోని చెరువు సమస్యను స్థానికులు ట్వీటర్‌ ద్వారా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంగర్‌హౌస్‌ చెరువును పరిశీలించిన మేయర్‌  

హైదరాబాద్/లంగర్‌హౌస్‌: చెరువుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నాంది పలికింది. లంగర్‌హౌ్‌సలోని చెరువు సమస్యను స్థానికులు ట్వీటర్‌ ద్వారా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సమస్యను పరిశీలించాల్సిందిగా, మేయర్‌ విజయలక్ష్మిని మంత్రి ఆదేశించారు. దీంతో మేయర్‌ సోమవారం లంగర్‌హౌస్‌ చెరువును పరిశీలించారు. ఎమ్మెల్యే కౌసర్‌ సమస్యలను వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చెరువు ఈ దుస్థితికి చేరిందన్నారు. లక్ష్మీనగర్‌, హరిదా్‌సపుర, ప్రశాంత్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన మహిళలు చెరువు వల్ల ఎదురవుతున్న సమస్యలను మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మి లంగర్‌హౌస్‌ చెరువును తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మేయర్‌ వెంట జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డేపల్లి నరసింహ, నానల్‌నగర్‌ కార్పొరేటర్‌ మహ్మద్‌ నసీరుద్దీన్‌, మాజీ కార్పొరేటర్‌ చెరుకుల ఉదయ్‌కుమార్‌, బీజేపీ డివిజన్‌ అధ్యక్షులు గోపిరెడ్డి నాగేంద్ర ప్రకా్‌షరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నాయకులు గోపాల్‌, సునంద పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T15:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising