ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

ABN, First Publish Date - 2022-12-13T03:09:08+05:30

ఆస్తి కోసం ఓ తమ్ముడు సొంత అన్నను అత్యంత దారుణంగా చంపేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఇద్దరితో కలిసి గడ్డపారతో దాడి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

రంగారెడ్డి జిల్లా తుర్కగూడలో ఘటన

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం ఓ తమ్ముడు సొంత అన్నను అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి తుర్కగూడలో జరిగింది. గ్రామానికి చెందిన కందాల నర్సింహారెడ్డి(48)కి ముగ్గురు సోదరులున్నారు. వీరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి సమంగా పంచుకున్నారు. కాగా, మరో 15 గుంటల భూమిని నర్సింహారెడ్డి ఇతరుల నుంచి కొనుగోలు చేశాడు. ఈ భూమిపై కన్నేసిన తమ్ముడు జనార్ధన్‌రెడ్డి తనకూ అందులో వాటా కావాలంటూ తరచూ అన్నతో గొడవపడుతున్నాడు. ఈ నెల 3న అన్న పొలానికి అడ్డంగా జనార్ధన్‌రెడ్డి కడీరాళ్లను పాతుతుండగా అన్న నర్సింహారెడ్డి అడ్డుపడ్డాడు. దీంతో జనార్ధన్‌రెడ్డి.. సామ జంగారెడ్డి, పండాల శ్రీకాంత్‌గౌడ్‌లతో కలిసి నర్సింహారెడ్డిపై గడ్డపారతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాగా, దాడికి పాల్పడ్డ జనార్ధన్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌లను పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-12-13T03:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising