తెలంగాణలో 12 వేల మంది విక్రేతలు : మీషో
ABN, First Publish Date - 2022-05-26T09:38:36+05:30
12thousand customers to meesho
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తెలుగు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించనుంది. తెలంగాణలో మీషో ప్లాట్ఫామ్పై 12 వేల మందికి పైగా విక్రేతలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని మీషో చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ్ స్వామినాథన్ తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి చిన్నచిన్న వ్యాపారులను మీషో ప్లాట్ఫామ్ మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమయ్యామని చెప్పారు. చిన్న వ్యాపారులకు ఈ-కామర్స్పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలోనే హైదరాబాద్ నుంచి విక్రయదారులు ఆరు రెట్లు పెరగగా.. ఆర్డర్లు ఏడు రెట్లు పెరిగాయన్నారు.
Updated Date - 2022-05-26T09:38:36+05:30 IST